ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), ఇసుక, మద్యం కేసుల్లోనూ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఈ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై గతంలోనే వాదనలు పూర్తి కాగా.. తాజాగా మందుస్తు బెయిల్ మంజురూ చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. అలాగే మద్యం కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనరేశ్కు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో చంద్రబాబును ఏ1గా సీఐడీ పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటుగా మద్యం కంపెనీలను నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేసారని మరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చింది. మరో కేసులో ఇసుక పాలసీ వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మూడు కేసులపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించగా.. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇవాళ అన్ని కేసుల్లోనూ ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుల గురించి చంద్రబాబు ఎక్కడా మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు షరతులు విధించింది. అదే సమయంలో ఈ కేసుల్లో సీఐడీ మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ఠ కాలపరిమితితో నోటీసులు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇక స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు తుది తీర్పు రిజర్వ్ చేసింది. వచ్చే వారం క్వాష్ పిటిషన్ పైనా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa