ఏపీలోని లేపాక్షిని ప్రధాని మోదీ సందర్శించారు. వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి హారతి ఇచ్చిన మోదీకి ఆలయ విశిష్టతల గురించి అర్చకులు వివరించారు. అనంతరం నిర్వహించిన శ్రీరామ జయ రామ భజన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భజన కీర్తనలను ఆలపిస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగి పోయారు. దర్శనం తర్వాత వేదాశ్వీరచనాలు పలికి స్వామివారి శేషవస్త్రాన్ని మోదీకి ఆలయ అర్చకులు బహూకరించారు. తీర్థ ప్రసాదాలను అందించారు. 40 నిమిషాల పాటు ఆలయంలో ఉన్న ప్రధాని మోదీకి.. లేపాక్షి ఆలయ చరిత్ర, విశిష్ఠతను అధికారులు వివరించారు. ఏకరాతితో నిర్మించిన మహాశివుడి విగ్రహం, వేలాడే రాతి స్తంభం, ఆలయ ప్రాశస్త్యం, శిల్పకళ సంపద, దేవాలయ నిర్మాణాలను తెలియజేశారు. తోలు బొమ్మలాట కళారూపం ద్వారా రామాయణ ఘట్టాల ప్రదర్శనను మోదీ ఆసక్తికరంగా తిలకించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa