ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైమానిక రంగంలో భారత్‌ దూకుడు: మోదీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 20, 2024, 09:07 AM

దేశీయ విమానాల విపణిలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానాన్ని ఆక్రమించనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వైమానిక విభాగంలోని పరిశోధనలు, నవ్యాలోచనలు ప్రపంచ సాంకేతిక రంగానికి నాయకత్వం వహిస్తాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ పథకం దేశీయ వైమానిక రంగ సామర్థ్యాన్ని అంతకంతకు పెంచిందన్నారు. బెంగళూరులో ప్రారంభించిన బోయింగ్‌ కేంద్రం భారతీయ నైపుణ్యంపై విశ్వాసాన్ని పెంచగలదని మోదీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa