ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IAS అధికారిపై ఈసీ వేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 20, 2024, 02:01 PM

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో నకిలీ ఓటర్లు, నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో IAS అధికారి గిరీషాపై ఈసీ వేటు వేసింది. ఎన్నికల సమయంలో తిరుపతి ఆర్వోగా గిరీషా పనిచేశారు. నకిలీ ఓటర్లు, ఓటరు కార్డుల జారీ కోసం అప్పటి ఆర్వో.. అధికారిక లాగిన్‌ను వినియోగించుకోవడంపై ఇటీవల ఈసీ సీరియస్ అయింది. అప్పటి తిరుపతి ఆర్వో, కమిషనర్ గిరిషాపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అధికారి గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా గిరీషా ఉన్నారు. సస్పెన్షన్ సమయంలో అధికారి గిరీషా విజయవాడ వదిలి వెళ్లకూడదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa