ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడానికి విజయవాడకు చేరుకున్న వైఎస్ షర్మిలా రెడ్డి కాన్వాయ్ను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన షర్మిల.. అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో విజయవాడలోని గాంధీ భవన్కు బయలుదేరారు. ఈ క్రమంలో ఎనికే పాడు వద్ద షర్మిల కాన్వాయ్ను పోలీసులు మళ్లించడంతో కాంగ్రెస్ నేతలు రోడ్డుమీద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సర్కారును ఉద్దేశించి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తన కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. భయపడుతున్నారా సార్’ అంటూ షర్మిల మాట్లాడారు. దీనిపై పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగానే షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాము ముందే రూట్ మ్యాప్ అందజేశామని, అయినా పోలీసులు అడ్డంకులు సృష్టించారని ధ్వజమెతత్తారు. ఇందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ కాన్వాయ్ కు అనుమతి ఇవ్వకపోతే మొత్తం విజయవాడ మొత్తాన్ని బంద్ చేస్తామని గిడుగు రుద్రరాజు హెచ్చరికలు చేశారు. మరోవైపు, వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. శ్రేణుల రాకతో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa