తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ ఈరోజు విడుదల చేసింది. ఈరోజు ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయగా.. 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టోకెన్లు విడుదల చేసింది. ఇక.. వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టోకెన్లను కూడా మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేసింది. ఇప్పటికే.. చాలా మంది భక్తులు టోకెన్లు బుక్ చేసుకుంటుండగా.. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా ప్రయత్నిస్తే టికెట్లు దొరికే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు గదుల కోటా టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. ఈ మేరకు షెడ్యూల్కు తగిన విధంగా టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే.. తిరుమలలో ఎల్లుండి (జనవరి 25న) శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి జరుగనుంది. ఇందుకోసం గురువారం రోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు. అదే రోజు.. పుష్యమాస పౌర్ణమి గరుడ సేవ కూడా ఉంటుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa