గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యవహారంతో విసిగిపోయిన ఆయన అనుచరులు తమకు టచ్లో ఉన్నారని గుడివాడ టీడీపీ ఇన్చార్జ్ వెనిగండ్ల రాము అన్నారు. గురువారం నాడు రాము ఆధ్వర్యంలో గుడివాడలోని 28వ వార్డులో ‘బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ - జనసేన కూటమి నేతలతో కలిసి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు సభ తర్వాత గుడివాడ నుంచి కొడాలి నాని పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు సోది, సొల్లు కబుర్లు చెబుతూ ఆయన కాలం గడిపాడని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ తరపున తామే ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 28వ వార్డులో పర్యటిస్తుంటే కొడాలి నాని ఎటువెళ్లారని ప్రజలు తమను అడుగుతున్నారని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడడం తప్ప, గుడివాడ కోసం కొడాలి నాని చేసింది ఏం లేదని వెనిగండ్ల రాము ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa