రాష్ట్రంలో అరాచకపాలన సాగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, చీరాల నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి స్వాములు (శ్రీనివాసరావు) అన్నారు. సహజ వనరులను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలంటే టీడీపీ, జనసేన పార్టీల కూటమి గెలుపు అనివార్యమని ఆయన పేర్కొన్నారు. గురువారం వేటపాలెం మం డలం పందిళ్లపల్లి నుంచి దేశాయిపేట వరకు స్వాముల పాదయాత్ర చేపట్టారు. మార్గమధ్యమంలో ఎన్టీఆర్, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్, పర్చూరు, ఎస్ఎన్ పాడు నియోజకవర్గాల పార్టీ బాధ్యులు విజయ్కుమార్, కె.బాబు, కార్యదర్శి గూడూరి శివరామ ప్రసాద్, ఆమంచి రాజేంద్ర, టీడీపీ కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa