దివంగత వైఎస్సార్ మాట మీద నిలబడే నాయకుడు అయితే.. ఆయన తనయుడు, ఏపీ సీఎం జగన్ మాట తప్పే నాయకుడని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాని ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేదం చేయక పోతే ఓట్లు అడగను అని చెప్పిన జగన్.. ఆ తర్వాత మాటతప్పాడని చెప్పారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది ఆన్న జగన్.. ఇచ్చిన ప్రతి మాట తప్పారని మండిపడ్డారు. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకప్పుడు వైసీపీనీ నా భుజాల మీద వేసుకొని పాదయాత్ర చేశా. ఈరోజు కనీసం కృతజ్ఞత కూడా లేదు. నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా దాడులు చేస్తున్నారు. పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ఉన్నది వైఎస్సార్ రక్తమే. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగుతుందని.. ప్రత్యేక హోదా రావాలని...పోలవరం రావాలని.. రాజధాని రావాలని.. ప్రజలను మేలు జరగాలని నా పుట్టింటికి వచ్చా. నన్ను ఎంత తిట్టినా ఫర్వాలేదు.. నా మీద ఎన్ని నిందలు వేసినా ఫర్వాలేదు. ఎంతటి త్యాగానికి అయినా నేను సిద్ధం... ఎంతటి పోరాటానికి అయినా నేను సిద్ధం.
ఇదే తిరుపతిలో నిలబడి ప్రధాని మోడీ గారు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. 10 ఏళ్లు కాదు..15 ఏళ్లు కావాలని చంద్రబాబు ఇదే పవిత్ర ప్రదేశంలో నిలబడి అడిగారు. ఇచ్చిన మాట ఏమయ్యిందని మోడీని అడుగుతున్నాం. బీజేపీ కేడీల పార్టీ. కేడీ పార్టీకి మద్దతు తెలిపిన బాబు, జగన్ కేడీలు కారా..? జగన్, బాబు ఆలీ బాబా అర డజన్ దొంగలు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. రాష్ట్రాన్ని ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. లక్షల్లో ఉద్యోగాలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్ట్కి కాంగ్రెస్ జాతీయ హోదా ఇస్తే... నిధులు ఇవ్వని మోడీ ఒక కేడి.
బాబు అమరావతి అని.. సింగపూర్ అని త్రీడీ గ్రాఫిక్స్ చూపించారు. జగన్ ఆన్న మూడు రాజధానులు అన్నారు.. చివరికి ఒక్క రాజధాని కూడా లేదు. కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో కూడా లేదు. ఆంధ్ర ప్రజలు అంతా తీసి పోయారా..? మాకు రాజధాని లేదు.. పోలవరం లేదు.. హోదా లేదు. మోడీ మనకు వెన్నుపోటు కాదు.. కడుపులో పొడిచాడు. అయినా జగన్ ఆన్న, బాబు ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు. ఒక్క సీటు గెలవని బీజేపీ ఆంధ్రాలో రాజ్యం ఏలుతుంది. కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు నెరవేరుతాయి." అని షర్మిల వ్యాఖ్యనించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa