బీజేపీ నేత, కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి కీలక ప్రకటన చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. హిందూపురం ఎంపీగా పోటీ చేసేదుంకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. దేశంలోనే ఆ నియోజవర్గానికి ఓ ప్రత్యేక ఉందని.. అందుకే అదిష్ఠానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
‘దేశంలోనే హిందూ శబ్దంతో పేరున్న నియోజకవర్గం హిందూపురం మాత్రమే. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచి పార్లమెంటుకు వెళ్లి, ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని దిల్లీలో చెప్పాలని ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లా. వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోనూ ఎంపీగా పోటీ చేసే విషయమై చర్చించా' అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందూపురంలో హిందూ మత ప్రచారం, వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంత కాలంగా యాక్టివ్గా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం..దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టుుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానందకు సీటు కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో ఆయనే ఓ అడుగు ముందుకేసి తన మనసులోని మాట బయటపెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa