ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను, అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక ఆయనకు చెడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి అని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. అయన మాట్లాడుతూ.... సీఎం జగన్ దేశంలో మరే ముఖ్యమంత్రీ అందించనంత సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరే సీఎం చేయనంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులను, మహిళలను ఉన్నత స్థితిలోకి తెస్తున్నారు. సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టారు. మంత్రులే ప్రజల ఇంటికి వెళ్లి మాట్లాడిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కటీ పరిష్కరించాం. నక్క జిత్తుల నాయకులు మనల్ని చెడు మార్గంలో నడిపించి అధికారం పొందాలని చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. మన నాయకుడు జగన్ సింహంలా సింగిల్గానే వస్తారు. ప్రతిపక్షాల ప్రచారంపై తిరుగుబాటు చేయాలి. దేనికైనా రెడీ అన్నట్టు మనం ఉండాలి. పొత్తులతో వస్తున్న మాయగాళ్లతో, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa