ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చించారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్పై చర్చించారు.. సుమారు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది.. ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టుల భర్తీ చేస్తారు.
వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు కేబినెట్ ఓకే చెప్పింది. ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలకు ఓకే చెప్పారు. మరోవైపు ఇంధన రంగంలో రూ.22 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు.
3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ల ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం తెలిపారు. దాదాపు రూ.12,065 కోట్ల పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నారు. ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ను ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 4 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది.. ఇక, ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1350 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa