హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో అరెస్టైన లావణ్య ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తాకింది. ఈ కేసులో దొరికిపోయిన లావణ్యకు నారా బ్రాహ్మణి తెలుసంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ స్పందించింది.. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, నీ టికెట్ కూడా వద్దు అని ఛీ కొట్టి పోతుంటే, జగన్ రెడ్డికి లండన్ మందులు కూడా పని చేయక, ఇంట్లో ఆడవాళ్ళ పై కూడా విష ప్రచారం చేపిస్తున్నాడు. పిల్ల సజ్జల చేత, తన ఇంట్లో సొంత చెల్లెలు పైనే తప్పుడు రాతలు రాపిస్తున్న జగన్ రెడ్డి, ఇప్పుడు నారా బ్రహ్మిణి గారి పై వాట్స్ అప్ లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. ప్రజలు బుద్ధి చెప్తున్నా, ఈ సైకో బుద్ధి మాత్రం మారటం లేదు. ఈ 090149 32988 నెంబర్ తో ప్రచారం చేసిన వాడికి చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని తెలియ చేస్తున్నాము' అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
హైదారాబాద్లో లావణ్య అనే యువతి ఆదివారం రాత్రి పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్తో పోలీసులకు దొరికిపోయింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటుపడిన ఆమె డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేల్చారు. తాజాగా మరో ఇద్దరితో కలిసి వాటిని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. గతేడాది నమోదైన ఓ కేసులో పరారీలో ఉన్న మహిళగానూ తేలింది. విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు. హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన ఆమె గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నారు.
లావణ్య షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తున్న క్రమంలో స్నేహితుడు శేఖర్రెడ్డి ద్వారా నార్సింగిలో నివాసం ఉండే ఉనీత్రెడ్డితో పరిచయం ఏర్పడింది. 2014లో వారిద్దరూ కలిసి దేవదాసుకు పెళ్లైంది అనే షార్ట్ ఫిల్మ్లోనటించారు. అప్పటికే ఉనీత్కు డ్రంగ్స్ అలవాటు ఉండేది.. 2022లో ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం ఠాణాలో అతనిపై డ్రగ్స్ కేసు నమోదైంది. ఉనీత్ బెంగళూరులో ఎండీఎంఏ డ్రగ్ గ్రాము రూ.1,500తో కొనుగోలు చేసి హైదరాబాద్లో రూ.6 వేలకు విక్రయించేవాడు. నార్సింగిలోని అతడి నివాసంలో అతడి ప్రియురాలు ఇందిర, లావణ్యలు డ్రగ్స్ తీసుకునేవారు. ఉనీత్ వారిద్దరిని ఎండీఎంఏ విక్రయించేందుకు వినియోగించేవాడు.
గతేడాది ఆగస్టులో సైబరాబాద్లోని మోకిల పోలీస్ స్టేషన్లో ఉనీత్పై కేసు నమోదైంది. ఇందులో లావణ్య ఒక నిందితురాలు.. ఆమె పోలీసులకు చిక్కకుండా పరారైంది. తాజాగా ఈ నెల 28న ఉనీత్రెడ్డి, ఇందుల నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ తీసుకుంది. గ్రాము వినియోగించిన అనంతరం మిగిలిన 4 గ్రాములు విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ, నార్సింగి పోలీసులు కోకాపేటలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో ఉనీత్రెడ్డి, ఇందు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితురాలు తరచూ విదేశాలకు వెళుతోందని, అరెస్టు చేయకపోతే ఇతర దేశాలకు పారిపోయే అవకాశముంది అంటున్నారు. ఈ కేసు ఇప్పుడు ఏపీ రాజకీయాలకు కూడా పాకింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa