ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ఫలితాలపై సమీక్షలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఎంపికతో తీరికలేకుండా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో యూఏఈ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో ఆదేశంలో పర్యటించనున్నారు. దుబాయ్లో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు వ్యాస్ తెలిపారు. అంతకుముందే ఈ నెలాఖరులో దుబాయ్ వెళ్లి రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు జనసమీకరణకు సన్నాహాలు చేయనున్నట్లు ఆయన వివరించారు.
రాహుల్ దుబాయ్ పర్యటన మాత్రం కచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా వ్యాస్ పేర్కొన్నారు. షార్జా వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు యూఏఈలో ఉన్న ప్రవాసులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa