మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అనేది దీని ఉద్దేశమన్నారు. రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతామన్నారు. విశాఖపట్నంలో డాక్టర్ వైయస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్లో గె లుపొందిన విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ముఖ్యమంత్రి అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa