ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలోనే కొనసాగుతా.. ఆ ఇద్దరు ఎంపీలను పార్టీ మారొద్దని చెప్పినా వినలేదు: ఆదాల ప్రభాకర్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 14, 2024, 07:34 PM

వైఎస్సార్‌సీపీని వీడే సమస్యే లేదంటున్నారు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని.. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. అధినేత ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమంటూ స్పష్టం చేశారు. అసెంబ్లీకి పోటీ చేస్తానా.. లోక్‌సభకు పోటీ చేస్తానా అన్నది అధినతను కలిసిన తర్వాత క్లారిటీ ఇస్తానన్నారు. ఏడాది నుంచి తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. అసంతృప్త నేతలను తాను స్వయంగా కలిసి నచ్చజెప్పే యత్నం చేసినా.. చర్చలు ఫలించలేదన్నారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో తాను చర్చలు జరిపిన మాట వాస్తవమేనని.. కానీ అవి సఫలీకృతం కాలేదన్నారు. వేమిరెడ్డి, మాగుంటలను కలిసి నచ్చజెప్పే యత్నం చేశానని.. వారిని పార్టీ మారొద్దని కోరినా సానుకూలంగా స్పందించలేదన్నారు. వేమిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. మాగుంట మాత్రం కాస్త సానుకూలంగానే స్పందించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa