విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన మల్లేశ్వరాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఆరేళ్ల భక్తుల నిరీక్షణ ఫలించింది.. ధ్వజస్తంభ సహిత స్వర్ణశిఖర కుంభాభిషేక మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. దాత సంగా నరసింహారావు రూ.8 కోట్ల వ్యయంతో మల్లేశ్వరాలయ విస్తరణ పనులతో పాటు ధ్వజస్తంభం, స్వర్ణ శిఖరం ఏర్పాటు చేయించారు. దేవస్థానం.. రూ.4.5 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టింది. నవగ్రహాలు, ఆదిశంకరాచార్య విగ్రహ ప్రతిష్ఠ చేయాల్సి ఉంది.
ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ, స్వర్ణశిఖరం కుంభాభిషేక ఉత్సవంలో పాల్గొన్నారు. పాంచాహ్నిక దీక్ష స్వీకరించిన అర్చకులు ఐదు రోజుల పాటు స్వర్ణశిఖరం, ధ్వజస్తంభం, జల, ధాన్య, పుష్ప, ఫల, ధాతు, బీజ, రత్నాన్యాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహ స్థపన, కళాన్యాసం, కల్యాణోత్సవాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాదశర్మ, ట్రస్టుబోర్డు ఛైర్మన్ రాంబాబు, ఏఈవోలు, వైదిక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa