ఎన్టీఆర్ జిల్లాలో పూలకు భారీ డిమాండ్ వచ్చింది. మాఘ మాసం కావడంతో మల్లెల సీజన్ మొదలైంది. శుభకార్యాలు ముమ్మరంగా జరుగుతుండటంతో మల్లెలకు గిరాకీ పెరిగింది. సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవటంతో వారం రోజులుగా ధరలు పెరిగాయి. మల్లెలకు ప్రసిద్ధి గాంచిన మైలవరం మండలంలోని చండ్రగూడెం మార్కెటులో ఆదివారం కిలో రూ.1,200 పలికింది. అయితే రోజుకు సగటున 50 కిలోల దిగుబడులు మించటం లేదని రైతులు చెబుతున్నారు. అందుకే సాధారణ దిగుబడులు సమయంలో కిలో రూ.200ల లోపే ధర ఉంటుండగా.. ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయని రైతులు చెబుతున్నాయి.
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో దిగుబడుల్లో ఆలస్యం, రైతులకు ఇబ్బందిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఒకటి, రెండు నెలలు ఆగితే మల్లెపూల దిగుబడి పెరుగుతుందని.. అప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే కేజీ మల్లె పూలకు రూ.1200 ధర పలకడం మాత్రం స్థానికంగా చర్చ జరుగుతోంది. పెళ్లిళ్లలతో పాటుగా ఇతర శుభాకార్యాలు జరుగుతుండటంతోనే పూలకు డిమాండ్ పెరుగుతోందని స్థానిక రైతులు, వ్యాపారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa