కష్టం అన్న ప్రతీ ఒక్కరినీ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందని వైయస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం ఆయన పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ..జనసెన పార్టీ ఎందుకు స్థాపించారో పవన్ ఇప్పటికైనా చెప్పాలని డిమాండు చేశారు. నిరంతరం ప్రజల మధ్య వైయస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని, కష్టం అన్న ప్రతీ ఒక్కరినీ జగనన్న ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో చేయూత రూపంలో మహిళలకు తోడ్పాటునందిస్తున్నామని తెలిపారు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ప్రజలపై, అధికారులపై దౌర్జన్యం చేశారని గుర్తు చేశారు. రాజకీయ భవిష్యత్ కోల్పోతున్నాం అని జనసైనికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసిన టాక్స్లు ఎగగొడితే అరెస్టులు చేయరా అని ప్రశ్నించారు. తప్పుచేస్తే చంద్రబాబు అయిన ఒకటే అన్నారు. చేయని పనులకు చేసినట్లు బిల్లు వసూళ్లు చేసిన చరిత్ర టీడీపీ నాయకులది, టీడీపీ హయాంలో ఇరిగేషన్, అగ్రికల్చర్, ఐటీ శాఖలు అంతా అవినీతిమయమే అని దేవినేని అవినాష్ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa