హోం మంత్రి తానేటి వనిత మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం (మార్చి 1) ఉదయం ఆమె తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గౌరీపట్నం వెళ్తుండగా.. మార్గమధ్యంలో దుద్దుకూరు సమీపంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదానికి గురై రోడ్డు పక్కన పడి ఉన్నాడు. అది గమనించిన మంత్రి తానేటి వనిత వెంటనే తన కాన్వాయ్ని ఆపించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి గురించి ఆరా తీసి, వెంటనే ఆయణకి సాయం అందించాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని తన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇందుకోసం కాన్వాయ్లోని ఓ వాహనాన్ని వాడుకోవాలని సూచించారు. అయితే, సాయం చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి బాధితుడు ఒకింత ఆందోళనకు గురయ్యాడు. కంగారు పడొద్దని, అతడికి సాయం చేసేందుకు వారంతా వచ్చారని మంత్రి తానేటి వనిత ధైర్యం చెప్పారు. బాధితుడిని లింగాల వెంకట్రావుగా గుర్తించారు. దుద్దుకూరుకు చెందిన క్వారీలో అతడు పనిచేస్తున్నాడు. అయితే, రోడ్డు ప్రమాదానికి ఎలా గురయ్యాడనేది మాత్రం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa