ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన పార్టీ తరఫున ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తా: నిహారిక కొణిదెల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 07:54 PM

జనసేన తరఫున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను అన్నారు సినీ నటి నిహారిక కొణిదెల. గత ఎన్నికల్లోనూ తన బాబాయి, జనసేన తరఫున ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తన బాబాయి పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. తనకు ఓటు సైతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందన్నారు. గత ఎన్నికల్లో కూడా ఏపీలో ప్రచారం చేశానని.. ఈసారి కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తానన్నారు


  బాబాయి పవన్ కళ్యాణ్‌తో వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నప్పుడు చాలా బాధగా అనిపించిందన్నారు. అందుకే సాగు ఇండిపెండెంట్ ఫిల్మ్‌ వైపు కనెక్ట్ అయ్యానన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయని.. సాగులో చెప్పిన ఓ అంశంతోపాటు ఇంకా అనేక కారణాలతో వారు చనిపోతూ ఉంటారన్నారు. ఏమైనా పర్లేదు, అండగా ఉంటాం అనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ జీవితంలో ఏదైనా చేసేయొచ్చన్నారు. తాను బాధలో ఉన్న ప్రతిసారి తన కుటుంబసభ్యులు, స్నేహితులు తనకు అండగా నిలబడి ముందుకు వెళ్లడానికి సాయం చేశారన్నారు.


వంశీ తుమ్మల, హారిక కీలక పాత్రల్లో నటించిన ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ‘సాగు’. వినయ్‌ రత్నం దర్శకత్వం వహించారు. నిహారిక సమర్పిస్తున్నారు. ఈ సినిమా మార్చి 4 నుంచి ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. స్క్రీనింగ్‌ పూర్తయిన అనంతరం టీమ్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయని.. వాటి గురించి బాధపడకుండా ముందుకెళ్లాలని తెలియజేసే ఈ సినిమాకు తాను కనెక్ట్‌ అయ్యానన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ఒక్క అడుగులో ఓటమిని అంగీకరించకూడదు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పే సినిమా ఇది.. నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa