రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.టీడీపీ నేతలు, కార్యకర్తల అణచివేతే లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతోందని లేఖలో ప్రస్తావించారు.ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటూ టీడీపీ నేతలను వేధిస్తోందని లేఖ రాశారు. మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్డీఆర్ఐ దుర్వినియోగాన్ని లేఖలో తెలియజేశారు. ప్రభుత్వ విభాగాల ద్వారా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నార్నారు.
ఏపీఎస్డీఆర్ఐ ద్వారా టీడీపీ నేతలను బెదిరించి ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీఎస్డీఆర్ఐను ప్రతిపక్షాలను వేధించేందుకు ఆయుధంగా ప్రభుత్వం వాడుకుంటోంది అన్నారు. అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని.. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కూడా ఈ విభాగం ద్వారా కేసుల పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారన్నారు.
శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్గా విధులు నిర్వహించారని.. అయినా ఏపీఎస్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోందన్నారు. కేంద్ర సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటలిజెన్స్ విచారణ చేస్తుండగానే మళ్లీ అదే అంశాన్ని ఏపీఎస్డీఆర్ఐ విచారణకు స్వీకరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులే లక్ష్యంగా తప్పుడు కేసులను ప్రభుత్వం బనాయిస్తోందన్నారు.
అసలు రాష్ట్రంలో ఏపీఎస్డీఆర్ఐ ఎందుకు స్థాపించబడింది...దాని లక్ష్యాలు ఏమిటి.? అని ప్రశ్నించారు. కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్డీఆర్ఐ పనా? ఏపీఎస్డీఆర్ఐ రాష్ట్రంలో ఏర్పడ్డాక ఎన్ని కేసులు నమోదు చేసింది? అన్నారు. ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలను కేసుల పెట్టి వేధిస్తోందన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏపీఎస్డీఆర్ఐ ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఏపీఎస్డీఆర్ఐ వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని.. ఏపీఎస్డీఆర్ఐని దుర్వినియో
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa