ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయపార్టీలు కసరత్తులు పూర్తి చేస్తున్నాయి. విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలో నిలిపేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే పక్క పార్టీలలో ఉన్న బలమైన అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకుంటూ గెలుపు వ్యూహాలను రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ తరుఫున ఎంపీ అభ్యర్థిగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరుఫున బైరెడ్డి శబరిని బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి.
ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి. ప్రస్తుతం ఈమె నంద్యాల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సైతం బీజేపీ పార్టీలో ఉన్నారు. అయితే సీమలో బైరెడ్డి కుటుంబానికి మంచి పేరుంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలోనే శబరిని నంద్యాల లోక్ సభకు టీడీపీ నుంచి పోటీ చేయించాలమనే ప్రతిపాదనలు వస్తున్నాయని సమాచారం.
మరోవైపు బైరెడ్డి శబరికి టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ టికెట్ ఖాయమనే ప్రచారం రావటంతో.. బైరెడ్డి అనుచరులు అప్పుడే సంబరాలు కూడా మొదలెట్టారు. నరసింహా రెడ్డి నగర్ చౌరస్తా వద్ద మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో పాణ్యం అసెంబ్లీ టీడీపీ టికెట్ ను బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి బైరెడ్డికి పాణ్యం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఇటీవల ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పుడేమో ఆయన కూతురికి ఎంపీ టికెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ నుంచి ఈ విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఒకట్రెండు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాలకు రానున్నా్రు. ఈ సమయంలో వీటికి క్లారిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa