ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయబరేలీ నుంచి ప్రియాంక.. మళ్లీ అమేధీ నుంచి రాహుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 06, 2024, 10:58 PM

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సిద్ధమవుతున్నారు. తొలిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడనుండగా.. తన తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయబరేలీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మూడుసార్లు విజయం సాధించారు. తర్వాత సోనియా సైతం ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇక, రాహుల్ గాంధీ అమేధీ నుంచి మళ్లీ పోటీకి సమయాత్తమవుతోన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూశారు. అయితే, వాయనాడ్ నుంచి మాత్రం గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కానీ, మరోసారి రాహుల్ అమేధీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నాయి.


ప్రియాంక గాంధీ పోటీపై పెద్ద చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ఎందుకు చేయకూడదు అని బదులిచ్చారు. ప్రస్తుతం కూడా ఆమె ఎన్నికల్లో పోటీపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో కేవలం రాయబరేలీలో విజయం సాధించింది. సోనియా గాంధీ పోటీలో ఉన్న ఆ స్థానం నుంచి ఇప్పుడు ప్రియాంకను దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆమె స్థానంలో కుమార్తె ప్రియాంక‌కు టిక్కెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa