వేసవి కాలం ప్రారంభంలోనే నీటి కరవుతో కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్రంగా అల్లాడిపోతోంది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నగరవాసులకు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే వాటర్ ట్యాంకర్ల యజమానులు ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ట్యాంకర్లకు ఫిక్స్డ్ ధరలను నిర్ణయించింది. ఇక నీటిని వృథా చేసేవారికి ఆయా హౌసింగ్ సొసైటీలు భారీగా జరిమానాలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే నీటి కొరత కారణంగా కాళ్లకృత్యాలు కూడా తీర్చుకోలేని దుస్థితి తలెత్తింది. దీంతో పక్కనే ఉన్న షాపింగ్ మాల్స్కు వెళ్లి అక్కడ టాయిలెట్లను ఉపయోగించుకుంటున్నారు.
బెంగళూరులోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలో నివసిస్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ పెను దుమారం రేపుతోంది. తమ అపార్ట్మెంట్లో తీవ్ర నీటి కొరత ఉందని.. దీంతో సమీపంలోని ఓ మాల్కి వెళ్లి టాయిలెట్లను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు ప్రెస్టీజ్ ఫాల్కన్ అధికారులు స్పందించారు. అయితే తమ అపార్ట్మెంట్ వాసులు షాపింగ్ మాల్లలోని బాత్రూమ్లను ఉపయోగిస్తున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధాలను స్పష్టం చేశారు. వారు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
బెంగళూరులో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో బోర్లు ఎండిపోయాయి. మరోవైపు.. బెంగళూరు నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో నీటి సంక్షోభం తలెత్తింది. దీంతో నగర వాసులు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతుండటంతో.. ట్యాంకర్ల యజమానులు రేట్లను భారీగా పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కొందరు బెంగళూరులో ఏర్పడిన నీటి సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉచిత బస్సులు, ఉచిత విద్యుత్ కాదు.. తాగునీరు లేకపోతే జనం బతికేదెలా" అని ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశాడు.
ఇక కర్ణాటక రాష్ట్రంలోని 136 తాలూకాల్లో 123 తాలూకాలను కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించామని.. 109 తాలూకాలు తీవ్ర నీటి కరవుతో అల్లాడుతున్నాయని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. బెంగళూరులో నీటి కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఉన్న నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగానే ఇకపై బెంగళూరు నగరంలో కార్లు కడిగేందుకు.. గార్డెన్లలో చెట్లకు నీరు పోసేందుకు, నిర్మాణాలు, వాటర్ ఫౌంటైన్లు, రోడ్ల నిర్మాణాలకు తాగునీటిని ఉపయోగించడంపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మంచినీటిని ఉపయోగిస్తే వారికి రూ.5 వేల ఫైన్ విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa