ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీవాసులకు అలర్ట్.. సచివాలయంలో సర్టిఫికేట్ కావాలా.. అప్పటిదాకా ఆగాల్సిందే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 07:23 PM

ఏపీ ఎన్నికలకు షెడ్యూల్ వెల్లడైంది. మే 13వ తేదీన ఏపీలో ఎన్నికల జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నా్రు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో బ్యానర్లు, ఫోటోలు తీసివేయించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్టిఫికేట్ల జారీని నిలిపివేయించారు.


ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని, పౌరసేవలను ప్రజలకు చేరవేస్తున్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్ల ద్వారా కులధ్రువీకరణ, ఆదాయ, నివాస, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజి సర్టిఫికేట్. కొత్త రేషన్ కార్డు సహా పలురకాల సర్టిఫికేట్లనుఅందజేస్తున్నారు. కొన్నింటిని ఉచితంగా.. మరికొన్నింటిని స్వల్ప ఛార్జీలతో కొత్తకార్డులను ప్రజలకు సచివాలయ సిబ్బంది ఇంతకాలం అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఈ సర్టిఫికేట్ల జారీ నిలిచిపోయింది.


ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కార్డుల మీద సీఎం సహా ఇతర మంత్రుల ఫోటోలు ఉండకూడదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలతో సచివాలయాల్లో సర్టిఫికేట్ల జారీ నిలిచిపోయింది. అలాగే మీసేవా కేంద్రాలలో కూడా సీఎం ఫోటోలతో ఉన్న ధ్రువపత్రాల జారీని నిలిపివేశారు. సీఎం ఫోటో లేకుండా కొత్త స్టేషనరీ వచ్చేవరకూ ఎలాంటి సర్టిఫికేట్ల జారీ వద్దని అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాగే కలెక్టర్లతో నిర్వహించే స్పందన కార్యక్రమం కూడా రద్దైంది. ఈ నేపథ్యంలోనే కొత్త స్టేషనరీ వచ్చే వరకూ సర్టిఫికేట్ల జారీ ఉండదని అధికారులు చెప్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa