తెలుగుదేశం పార్టీ గెలిస్తే, మాదిగలు గెలిచినట్లేనని, టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆదివారం ఉండవల్లిలో చంద్రబాబుతో ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ భేటీ అయ్యారు. చంద్రబాబుకు పలు అంశాలతో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.... మాదిగ వర్గ ప్రజల అభ్యున్నతికి మొదటి నుంచి పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు. తెలుగుదేశం విజయంలో మాదిగలు కీలకపాత్ర పోషించాలని కోరారు. 40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోందన్నారు. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు తాను ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తెలుగుదేశం గెలుపు మాదిగల గెలుపు అవుతుందన్నారు. మాదిగ సామాజికవర్గాన్ని అధికారంలో భాగస్వాములు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాదిగ సమస్యలపై మందకృష్ణ ప్రత్యేకంగా చర్చించారు. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కొవడంలో మందకృష్ణ చేస్తున్న పోరాటాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa