ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాకినాడలో ఆకట్టుకున్న యుద్ధ నౌకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 30, 2024, 12:29 PM

భారత్‌-అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా కాకినాడ తీరంలో నిర్వహిస్తున్న ‘టైగర్‌ ట్రయంఫ్‌-24’ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలతో పాటూ భారత తరఫున ఐఎన్‌ఎస్‌ జలస్వ, కేసరి, ఐరావత్‌ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యుద్ధ సమయంలో శత్రుదేశాలపై చేసే వీరోచిత పోరాటాలు, విపత్తులు, ఆపద సమయాల్లో అందించే రెస్క్యూ సేవలను ప్రదర్శించారు. సీ ఫేజ్‌లో భాగంగా కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌లో మూడు రోజుల నుంచి భారత్‌-అమెరికా సంయుక్త విన్యాసాలు చేపడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భారత్‌ నుంచి 700 మంది, అమెరికా నుంచి 400 మంది సిబ్బంది తమ పోరాట పటిమను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏడీఎం మార్టినెజ్‌ మేజర్‌ జనరల్‌ (54వ డివిజన్‌) అఖిలేశ్‌ కుమార్‌, నేవీ కమాండెంట్‌ రాజేశ్‌ ధన్‌ఖడ్‌, అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నీఫర్‌ లార్సన్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa