ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పొలిటికల్ జర్నీపై క్లారిటీ వచ్చేసింది. నరసాపురం ఎంపీ సీటు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో రాజుగారి రాజకీయ భవిష్యత్తు గందరగోళంలో పడింది. నరసాపురం ఎంపీగా శ్రీనివాసవర్మ పేరును ప్రకటించడంతో రఘురామకృష్ణరాజు షాక్ తిన్నారు. అయితే కూటమి తరపున నరసాపురం నుంచి తన పోటీ పక్కా అంటూ అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక టీడీపీ సైతం రఘురామను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా బరిలోకి దింపాలని భావిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే నరసాపురం సీటు ఇప్పించేందుకు చర్చలు కూడా జరిగాయని సమాచారం. అయితే అభ్యర్థి మార్పుపై కమలం పార్టీ నిర్ణయం తీసుకోకపోవటంతో.. టీడీపీనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. పాలకొల్లులో జరిగే ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు రఘురామకృష్ణరాజు ట్వీ్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం పాలకొల్లులో జరుగనున్న "ప్రజాగళం" సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూటమికి మద్దతు తెలిపి, ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు.
మరోవైపు వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు అసెంబ్లీకి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. పార్టీలోకి చేరిన తర్వాత ఉండి అసెంబ్లీ సీటును రఘురామకు ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఉండి సీటు టీడీపీకి కంచుకోట కాగా.. ఇక్కడి నుంచి రఘురామకృష్ణరాజును బరిలో నిలపాలని సైకిల్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఉండి స్థానానికి ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉండి నుంచీ టీడీపీ తరుఫున మరోసారి పోటీ చేయనున్నారు. తొలి విడతలోనే ఆయనకు టికెట్ ఖరారుచేసింది టీడీపీ అధిష్టానం. అయితే ఇప్పుడు మంతెన రామరాజును తప్పించి ఉండి నుంచి రఘురామను పోటీచేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa