రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ప్రచారం చేస్తూ, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా దేశంలో న్యాయమైన ఎన్నికలు నిర్వహిస్తే, భారతీయ జనతా పార్టీకి 180 సీట్ల కంటే ఎక్కువ రాదని అన్నారు.తాను ఎన్నికలను ప్రజల కోణంలోనే చూస్తానని, ప్రజల సమస్యల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రియాంక గాంధీ చెప్పారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి బీజేపీ మాట్లాడడం లేదని ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై వారు మాట్లాడటం లేదు. రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యల గురించి మాట్లాడడం లేదు అని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొంటూ, గత 10 సంవత్సరాలుగా ప్రజలు తమ జీవితాల్లో ఎలాంటి అభివృద్ధిని చూడలేదని, ప్రధాని మోడీ ప్రజలతో సంబంధాలు తెగిపోయారని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa