ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ భక్తుడి పెద్దమనసు.. అన్నవరంలో బంగారు ధ్వజస్తంభం.. ఎన్ని కేజీలో తెలుసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 07:32 PM

కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో మరో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ భక్తుడు పెద్దమనసుతో స్వామివారికి బంగారు ధ్వజస్తంభాన్ని తయారు చేయించారు. ఈ నూతన ధ్వజస్తంభాన్ని సోమవారం ప్రతిష్టించారు. సుమారు ఒకటిన్నర కేజీ బంగారంతో ఈ ధ్వజస్తంభం తయారు చేయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఛైర్మన్ రోహిత్, ఈవో రామచంద్రమోహన్‌తో పాటుగా పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


నెల్లూరు జిల్లాకు చెందిన ఓ భక్తుడు ఈ ధ్వజస్తంభం కోసం సాయం చేశారు. దాత సహకారంతో రెండు కోట్లు ఖర్చుపెట్టి సుమారు ఒకటిన్నర కేజీ బంగారుతో దీనిని తయారుచేశారు. ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలోని అనివేటి మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. అలాగే జాతీయ రహదారిపై కొత్తగా నిర్మించిన ఆలయంలో స్వామి, అమ్మవారు, పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ కూడా వైభవంగా నిర్వహించారు.


అన్నవరం వచ్చి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం. అందుకే పెద్దసంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వధూవరులు సత్యనారాయణ వ్రతం కోసం ఇక్కడికి పెద్దసంఖ్యలో వస్తుంటారు. అన్నవరంలో ప్రతిరోజూ సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలను ఆలయ అధికారులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల తరహాలో ఇక్క రోజూ నిత్యకళ్యాణాలు జరుగుతూ ఉంటాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa