ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 06:34 PM

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద ఎన్నికల స్పెషల్‌ టీంలు వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తుండగా రూ.2,07,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు కైకలూరు రూరల్‌ ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఎన్నికల ప్రత్యేక టీంలు ఈ తనిఖీలు నిర్వహించాయి. కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి చెందిన పెన్మెత్స వెంకట రామకృష్ణంరాజు రూ.2,07,000లు నగదును కారులో తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ నగదును ఆక్వా చెరువులకు ఖర్చులు నిమిత్తం తీసుకువెళుతున్నట్లు రైతు పేర్కొన్నాడు. అయితే సంబంధిత ధ్రువీకరణపత్రాలు అందజేయాలని రైతుకు సూచించారు. స్వాధీనం చేసుకున్న నగదును కైకలూరు రిటర్నింగ్‌ అధికారి కె. భాస్కర్‌కు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa