ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మే 13వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా 25 లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే రోజు తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేందుకు ఎన్నికల సంఘంతో పాటుగా ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఓటుహక్కు వినియోగించుకునేలా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇక వ్యాపార సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తూ ఓటర్లను ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనేలా చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే అభీ బస్ కూడా ఓ కొత్త ఆఫర్తో ముందుకు వచ్చింది.
ఈ ఎన్నికల్లో ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు అభీ ఓట్ పేరుతో అభీబస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది. మే 13వ తేదీన ఓటు వేసేందుకు సొంత ఊర్లకు వెళ్లేవారికి ఈ ఆఫర్ కింద బస్ టికెట్ ఛార్జీలో రాయితీ అందించనుంది. ఓటు వేసేందుకు వెళ్లేవారికి టికెట్ ఛార్జీలో 29 శాతం వరకూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు అభిబస్ ప్రకటించింది. ABHIVOTE కూపన్ కోడ్తో టికెట్ బుక్ చేసుకున్నవారికి కనీసం 20 శాతం తగ్గింపు లేదా గరిష్టంగా 250 రూపాయల వరకూ రాయితీ లభిస్తుందని అభి బస్ తెలిపింది. వీటితో పాటు అదనంగా వందరూపాయలు క్యాష్ బ్యాక్ కూడా పొందే వీలున్నట్లు తెలిపింది. ఇందుకోసం టికెట్ బుక్ చేసుకునే సమయంలో ABHIVOTE అని కూపన్ కోడ్ ఉపయోగించాలని సూచించింది. తెలుగురాష్ట్రాల ప్రజల కోసమే ప్రత్యేకంగా ఈ ఆఫర్ తీసుకువచ్చినట్లు అభి బస్ ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు తెలంగాణ ఆర్టీసీ సైతం.. విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ తెలిపింది. తిరుగు ప్రయాణంలో కూడా డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. వేసవి సెలవులు, ఎన్నికల సీజన్ నేపథ్యంలో ఈ రూట్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీఎస్ఆర్టీసీ ఈ డిస్కౌంట్ ఆఫర్ తీసుకువచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa