ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెల్లివిరిసిన మతసామరస్యం.. ఆలయం కోసం భూమిని దానం చేసిన ముస్లింలు

national |  Suryaa Desk  | Published : Sat, May 11, 2024, 10:38 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ..రాజకీయ నాయకులు మతం పేరుతో ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మతసామరస్యం వెల్లవిరిసింది. హిందూ ఆలయం కోసం ముస్లింలు తమ భూమిని దానం ఇచ్చి.. మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేవారికి చెప్పుతో కొట్టినట్టు చేశారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని పురాతన హిందూ ఆలయం కోసం ఇద్దరు ముస్లింలు తమ సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ తమ స్థలాన్ని పంచాయితీకి అందజేశారు.


కాన్సీపట్టా గ్రామంలో గౌరీ శంకర్ ఆలయం కోసం సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో 10 అడుగుల వెడల్పుతో 1200 మీటర్ల రహదారిని నిర్మించాలని భావించారు. అయితే, ఆ మార్గంలో రసూల్, మహ్మద్‌లకు చెందిన వ్యవసాయ భూమి ఉంది. దీంతో గ్రామ పెద్దలు వారిని సంప్రదించగా.. తమ భూమిని రహదారికి ఇవవ్వడానికి అంగీకరించారు. స్థల సేకరణ కోసం పంచాయతీ సభ్యులు, రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ భూమిలో కొంత భాగాన్ని రోడ్డు కోసం ఇచ్చేందుకు వీరు ఒప్పుకున్నారు.


పంచాయతీ నిధులతో త్వరలో నిర్మాణ పనులు చేపడతామని అధికారులు వెల్లడించారు. ఇక, పంచాయతీ మాజీ సభ్యుడు, రైతు గులాం రసూల్ మాట్లాడుతూ.. రహదారి సమస్యను సాకుగా చూపి సమాజంలో విద్వేషాలను రెచ్చగొటేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆలయానికి రోడ్డు లేకపోవడంతో మత కల్లోలానికి ప్రయత్నించారని అన్నారు. కాగా, ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో మరికొంత భూమి ఆలయ పేరున ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa