మదనపల్లి స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మ వారి జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాయని ఆర్యవైఽశ్య సంఘం మదన పల్లి అధ్యక్షుడు పొన్నగంటి ఓంప్రకాష్ తెలిపారు . ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వాసవీ కన్యకా పరమేశ్వరి జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . ఇందులో భాగంగా మంగళవారం నుంచి ప్రతిరోజు ఉదయం, సా యంత్రం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేకపూజలు నిర్వహిం చనున్నారు మంగళవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమై పంచామృతంతో పాటు కుంకుమార్చన నిర్వహించారు . 16వ తేదీ మహామంగళ హారతితో పాటు వాసవీ సహస్రనామ పారాయణం ఉంటుందని తెలిపారు. 17వ తేదీ చిన్నారి దేవతశ్రీ గాత్రకచేరి, అన్నమాచార్యుల కీర్తనలు నిర్వహిస్తారు. 18వ తేదీ అమ్మవారి జయం త్యుత్సవాల సందర్భంగా మదనపల్లిలోని ఆర్యవైశ్యుల దుకాణాలకు సెలవు ప్రకటిం చారు. 18న ఉదయం ఆర్యవైశ్య హాస్టల్ నుంచి ఆర్యవైశ్య యువకులు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు అలాగే మధ్యాహ్నం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయం లో అన్నదానం చేయనున్నారు . రాత్రికి అమ్మవారిని పల్లకిలో ప్రత్యేకంగా ఊరేగిం పు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నంఘం దేవత సతీష్, సూరే గిరిధర, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa