ముంచంగిపుట్టు మండలంలోని దారేల పంచాయతీ పరిధి పెదకోటలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన పంచాయతీ సర్పంచ్ పాండురంగ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామంలోని చేతిపంపులో నీరు ఇంకిపోవడంతో గిరిజనులు కిలోమీటర్ దూరంలోని వాగులో నీటికుంటలను తవ్వుకొని నీటిని తెచ్చుకుని రోగాల బారిన పడుతున్నారన్నారు. ఈ సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa