అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు మే 13వ తేదీ ఎన్నికలు జరిగాయి. జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీచేస్తోంది. విపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జట్టుకట్టి పోటీచేసింది. మరి ఓటర్లు ఎవరిని ఆశీర్వదించారనేదీ జూన్ నాలుగున తేలనుంది. అయితే పోలింగ్ అనంతరం మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ( ఏపీ లోక్ సభ)
వైఎస్సార్సీపీ- 0-4
టీడీపీ కూటమి- 21-25
ఇతరులు- 0
ఆరా ఎగ్జిట్ పోల్స్
వైఎస్సార్సీపీ - 94-104
టీడీపీ కూటమి - 71-81
ఇతరులు - 0
ఆరా ఎగ్జిట్ పోల్స్ (ఏపీ లోక్ సభ)
వైఎస్సార్సీపీ - 13-15
టీడీపీ కూటమి - 10-12
ఇతరులు - 0
భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్
వైఎస్సార్సీపీ - 112-143
టీడీపీ కూటమి - 32-63
ఇతరులు - 0
పీపుల్ పల్స్
వైఎస్సార్సీపీ - 45-60
టీడీపీ - 95 -110
జనసేన - 14-20
బీజేపీ- 02-05
ఇతరులు - 0
పార్థ ఎగ్జిట్ పోల్స్
వైఎస్సార్సీపీ - 110- 120
టీడీపీ కూటమి - 55 -65
ఇతరులు - 0
పయనీర్ పోల్ స్ట్రాటజీస్
వైఎస్సార్సీపీ - 31
టీడీపీ కూటమి - 144
ఇతరులు - 0
టీవీ 9 పోల్ స్ట్రాట్ ఎంపీ స్థానాలు (25)
వైఎస్సార్సీపీ - 13
టీడీపీ కూటమి - 12
ఇతరులు - 0
పీటీఎస్ గ్రూప్
వైఎస్సార్సీపీ - 44 - 47
టీడీపీ కూటమి - 128-131
ఇతరులు - 0
చాణక్య ఎక్స్
వైఎస్సార్సీపీ - 47
టీడీపీ కూటమి - 109
హోరాహోరీ - 19
ఇతరులు - 0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఏ రాజకీయ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే దానిపై వివిధ మీడియా సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేసాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార వైసీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపగా.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగగా.. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీసీట్లలో పోటీచేసింది. బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 లోక్ సభ స్థానాలలో బరిలో నిలిచింది, కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో నిలిచింది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీ జరగ్గా.. ఫలితాలు జూన్ నాలుగో తేదీన వెల్లడికానున్నాయి. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన మెజారిటీ మార్కు 88. మరి ఈ మెజారిటీ మార్కును కూటమి కైవసం చేసుకుంటుందా.. లేదా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అనే దానిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా వివిధ మీడియా సంస్థలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa