ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలో డబ్బులు జమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 04:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. గతేడాది ఖరీఫ్, ప్రకృతి విపత్తులు, రబీ సీజన్లలో కరువుతో నష్టపోయిన రైతులకు అకౌంట్‌లలో డబ్బులు జమ చేసింది. మొత్తం 92 శాతం మంది రైతుల అకౌంట్‌లలోకి పెట్టుబడి రాయితీ డబ్బుల్ని జమ చేసి చేయగా.. 8.89 లక్షల మంది అన్నదాతల అకౌంట్‌లలోకి రూ.1,126.31 కోట్లు జమ చేసింది.. ఇంకా 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు మాత్రమే జమ చేయాల్సి ఉంది. ఇవి కూడా త్వరగానే అకౌంట్‌లలోకి జమ చేయనున్నారు.


 పెండింగ్ ఉన్న నిధులు కూడా రైతుల అకౌంట్‌ల వివరాలు, ఆధార్ నంబర్లు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ సరిపోలకపోవడం వంటి సాంకేతిక కారణా­లతో ఆలస్యం అవుతోంది. ఈ సమస్యను బ్యాంకర్లు, అధికార యం­త్రాంగం పరిష్కరించిన వెంటనే మిగిలిన అర్హులకూ కూడా ఈ నిధుల్ని అకౌంట్‌లలోకి జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.


ఏపీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఆ సీజన్‌ ముగిసే లోగా పరిహారం అందిస్తోంది. 2023 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులతో ఏపీలోని 103 కరువు మండలాల్లో 14.24 లక్షల ఎకరాల్లో పంటలు తిన్నాయి. దీనికి సంబంధించి 6.60 లక్షల మందికి రూ.847.22 కోట్ల కరువు సాయంగా తేల్చారు. అలాగే గతేడాది రబీ ప్రారంభంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వర్షాలకు 6.64 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. నష్టపరిహారం కింద 4.61 లక్షల మందికి రూ.442.36 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లెక్కలు తేల్చారు.


కరువు, తుఫాను ప్రభావంతో 77 వేల మంది ఉండటంతో మొత్తం 10.44 లక్షలుగా తేల్చారు. రైతులకు మొత్తం రూ.1,289.57 కోట్లు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలింగ్ తర్వాత జమ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. దీంతో ఆ తర్వాత డబ్బుల్ని జమ చేశారు. మొత్తం 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేయాలి. ఆ వివరాలను వ్యవ­సాయ శాఖ సీఎంఎఫ్‌ఎస్‌కు పంపించగా.. వీరిలో 46,226 మంది రికార్డులు సరిగా లేవని వెనక్కి పంపారు. వీరందరికి కలిపి రూ.57.15 కోట్లు జమ కావాల్సి ఉండగా.. మిగిలిన 9,97,925 మంది రైతులకు సంబంధించి రూ.1,232.43 కోట్లు జమ చేయడానికి వ్యవసాయశాఖ సీఎఫ్ఎంఎస్‌కు తిరిగి ప్రతిపాదనలు పంపించింది.


రాష్ట్రవ్యాప్తంగా 8లక్షల89వేల784 మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు. మరో 1,08,141 మందికి సంబంధించి రూ.106.12 కోట్లు సాంకేతిక కారణాలతో జమ చేయలేదు. మిగిలిన 1.54 లక్షల మందికి రూ.163.27 కోట్లు జమ కాలేదు.. బ్యాంక్‌ ఖాతా అకౌంట్, రైతుల వివరాలు, ఆధార్‌ నెంబర్లు సరిపోలకపోవడంతో ఆ వివరాలను జిల్లాలకు పంపి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే వారికి కూడా సొమ్ములు జమ చేస్తామంటున్నారు అధికారులు.


రబీ 2023–24 కరువు ప్రభావం ఆరు జిల్లాల్లో 87 మండలాల్లో ఉన్నట్లు తేల్చారు. మొత్తం 2.37 లక్షలమంది రైతులకు చెందిన 2.52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతి­న్నట్లు గుర్తించారు. తుది నివేదిక రూపొందించి.. ఇప్పటికే సోషల్‌ ఆడిట్, అర్జీల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తయ్యింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తుది జాబితాలు రాగానే పెట్టుబడి రాయితీ విడుదల చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa