ఉచితం అని కనిపిస్తే చాలు.. జనం ఎగబడి పోతుంటారు. అలాంటిది రోడ్డుపై ఫ్రీగా కనిపిస్తే ఊరుకుంటారా.. దండెత్తరూ.. అలాంటి ఘటనే నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. వీడియో చూసిన జనం ఇలా తయ్యారయ్యారేంట్రా బాబూ అని కామెంట్స్ పెడుతున్నారు. రోడ్డుపై కోడిగుడ్లతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురికాగా.. సమీపంలోని గ్రామస్థులు గిన్నెలు, పాత్రలతో కోడిగుడ్ల కోసం ఎగబడ్డారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా గోస్పాడు మండల పరిధిలోని కానాలపల్లెలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు – కడప జాతీయ రహదారిపై కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది కానాలపల్లె మెట్ట వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వైపు వస్తున్న కోడిగుడ్ల లారీని వెనుక వైపు నుంచి వస్తున్న బొగ్గులారీ ఢీకొట్టింది. దీంతో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ భాస్కర్ గాయపడటంతో అతడిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.
అయితే కోడిగుడ్ల లారీ బోల్తా పడిన విషయం తెలుసుకున్న కానాలపల్లె, దీబగుంట్ల గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి ఎగబడ్డారు. ప్రమాదం గురించి తెలిసి ఘటనాస్థలికి పరుగు పరుగున చేరుకున్నారు. దొరికిన వాటిని దొరికినట్లుగా గిన్నెలు, పాత్రల్లో నింపుకెళ్లారు.లారీ బోల్తా పడిన సమయంలో సగం గుడ్లు పగిలిపోగా.. మిగతా గుడ్లను వారంగా ఎగబడి తీసుకెళ్లారు. కొందరైతే బకెట్లు తీసుకొచ్చి మరీ నింపుకుని వెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మద్దిలేటి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa