వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్పై స్పందిస్తూ.. వాళ్లిచ్చిన పోల్స్ చూసి ఆశ్చర్యంగా అనిపించిందన్నారు.. తనకు నవ్వొచ్చిందన్నారు. ఆ ఫలితాల్లో వైఎస్సార్సీపీకి రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రెండు స్థానాలు కూడా దయతో ఇచ్చారేమో అర్థం కావట్లేదంటూ సెటైర్లు పేల్చారు. మరీ ఎక్కువ సీట్లు తీసుకుంటే బాగోదు అనుకున్నారేమో అంటూ చురకలంటించారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ పాజిటివ్గా ఎన్నికల ప్రచారం చేసిన విషయాన్ని గమనించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఏపీలోనే ఉత్తర్వులు ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు ఏపీలో మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు ఆదేశాలు ఇచ్చారో చెప్పాలన్నారు.? పోలీసులు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జాతీయ స్థాయిలో బీజేపీ టార్గెట్గా పెట్టుకున్న 400 సీట్ల కోసం.. ఆ నంబర్లను సర్దుకుంటూ వెళ్లారేమోనని వ్యాఖ్యానించారు సజ్జల. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి.. తన మార్గదర్శకాలకు విరుద్ధంగా.. ఈసీ తాజాగా జారీచేసిన ఆదేశాలు బరితెగించి ఇచ్చినట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఈ ఆదేశాలను తికమక పెట్టడానికి ఇచ్చారో.. ఎందుకు ఇచ్చారో తెలియడం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్లప అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. సీల్, ఇతర వివరాలు అక్కర్లేదనడం సరికాదన్నారు. పోస్టల్ బ్యాలెట్లపై సంతకం ఎవరిదన్న విషయం ఎవరికి తెలుస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు వాళ్లే తూట్లు పొడిచారని.. ఆ సంతకం సంబంధిత అధికారిది కాకపోవచ్చు కదా అన్నారు. అధికారులు మాత్రం సీల్అవసరం లేదని చెప్పారని.. అదీ మన రాష్ట్రంలోనే ఉందన్నారు. అందుకే ఈసీ ఉత్తర్వుల్ని సవాల్ చేశామని.. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాలేదు.. సుప్రీం కోర్టును ఆశ్రయించామన్నారు.
ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని.. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని విమర్శించారు. అందుకే వైఎస్సార్సీపీ నేతలు, కేడర్ఎక్కడా సంయమనం కోల్పోవద్దు అని సూచించారు. ఎన్నికల్లో నిబంధనల ప్రకారం రావాల్సిన ప్రతీ ఓటు వచ్చేలా చూడాలని కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు. అక్కడ ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa