పార్వతీపురం జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం వచ్చింది. నాలుగు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఒకప్పటి నాగూరు నియోజవర్గమైన కురుపాంలో 25 ఏళ్ల తరువాత టీడీపీ విజయం సాధించింది. 1994లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మక జయరాజ్ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన శత్రుచర్ల చంద్రశేఖరరాజుపై 33 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్, సీపీఎం, వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2024 ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి నిలబడి, వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి పై 23,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తంగా కురుపాం కోటపై మళ్లీ టీడీపీ జెండా ఎగరడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa