ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. డెబిట్ కార్డుల లావాదేవీల కంటే క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్లే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలు, బ్యాంకులు కొంత ఛార్జీలు విధిస్తుంటాయి. అలాగే గడువులోపు తిరిగి చెల్లించకుంటే పెనాల్టీలు, అధిక వడ్డీ రేట్లు వేస్తుంటాయి. వార్షిక ఫీజుల వంటివీ ఉంటాయి అయితే, ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్న్యూస్ అందించింది. క్రెడిట్ కార్డుల ఛార్జీల్లో పలు మార్పులు చేసినట్లు తెలిపింది. కొన్ని రకాల ఛార్జీలను తొలగించింది. ఈ కొత్త రూల్స్ వచ్చే నెల జులై 1, 2024వ తేదీ నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది.
ఈ మేరకు క్రెడిట్ కార్డు యూజర్లకు ఇ-మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. కొత్త క్రెడిట్ కార్డు ఛార్జీల మార్పు జులై 1 నుంచే అమలులోకి వస్తుందని బ్యాంక్ వెబ్సైట్లో పేర్కొంది. చార్జ్ స్లిప్ రిక్వెస్ట్ కోసం ఇది వరకు రూ.100 చెల్లించాల్సి వచ్చేది. ఒక్కో స్లిప్ కోసం రూ.100 కట్టాల్సి ఉండేది. అయితే ఇకపై ఆ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. చార్జ్ స్లిప్ ఛార్జీలను తొలగిస్తున్నట్లు తెలిపింది ఐసీఐసీఐ బ్యాంక్. మరోవైపు.. చెక్ లేదా క్యాష్ పికప్ ఫీజు ఇది వరకు రూ.100 చొప్పున ఉండేవి. ఇకపై ఈ ఛార్జీలు ఉండవు. వాటిని సైతం తొలగించింది బ్యాంక్. మరోవైపు.. డయల్ ఏ డ్రాఫ్ట్ ట్రాన్సాక్షన్ ఫీ అనేది మీ బిల్ పేమెంట్లలో 3 శాతం లేదా మినిమం రూ.300 వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఛార్జీలను సైతం తొలగించింది.
ఇక ఔట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే ఇది వరకు చెక్ విలువలో 1 శాతం ఛార్జీలు ఉండేవి. లేదా రూ.100 కనీసం ఫీ చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ ఛార్జీలను సైతం బ్యాంక్ తొలగించింది. డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ ఛార్జీ రూ.100గా ఉండేది. ఇప్పుడు ఈ ఛార్జీలను సైతం తొలగించింది.
మరోవైపు.. కార్డు రీప్లేస్మెంట్లకు స్టాండర్డ్ ఛార్జీలు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి కార్డుకు ఈ ఛార్జీలు చెల్లించాలి. అలాగే ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డుకు ఈ ఛార్జీలు గరిష్ఠంగా రూ.3500 వరకు ఉన్నాయి. మరోవైపు.. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు రివార్డ్ ప్రోగ్రామ్లో జూన్ 18వ తేదీ నుంచి కీలక మార్పులు రానున్నాయి. అలాగే క్రెడిట్ కార్డుతో రెంట్ పేమెంట్లు చేసినప్పుడు ఇకపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు రావు. ప్రస్తుతం ఉన్న రివార్డ్ పాయింట్ల ప్రక్రియను తొలగిస్తోంది బ్యాంక్. అయితే, పెట్రోల్, డీజిల్ పేమెంట్లపై 1 శాతం సర్ ఛార్జీ డిస్కౌంట్ లభిస్తుంది. రివార్డు పాయింట్లపై ఎలాంటి ఆంక్షలు లేవని బ్యాంక్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa