వచ్చే ఏడాది జనవరి 26న భారత ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సెట్విన్ సీఈవో మురళీకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజికసేవ, సైన్స్, ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, పౌరసేవలు, వృత్తి, పరిశ్రమల రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వ్యక్తులు అర్హులని పేర్కొన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పద్మాఅవార్డ్స్.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని ఈనెల 22లోపు అలిపిరి వద్ద వున్న సెట్విన్ కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాల కోసం 0877-2286921, 94405 73537 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa