మరోవైపు సీఎం హోదాలో చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి రావటంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు వద్ద తమ గోడు వెళ్లబోసుకోవడానికి కొంతమంది ప్రజలు, కార్యకర్తలు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. వీరు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా బారికేడ్లు అడ్డుగా వచ్చాయి. దీంతో వారివద్దకు వెళ్లిన చంద్రబాబు.. వారి వినతులను పరిశీలించారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే పార్టీ కార్యాలయంలో బారీకేడ్లు పెట్టడంపై చంద్రబాబు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలిసినప్పుడు ఇలాంటివి పెట్టొద్దనీ.. తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి వ్యవస్థ తీసుకొస్తామన్నారు.
![]() |
![]() |