గురువారం కొవ్వూరులో పెనుప్రమాదం తృటిలో తప్పినట్టే ఐనది. వివరాల్లోకి వెళ్ళితే.... దొమ్మేరు వైపు నుంచి ఒక ఎర్టిగా కారు అతివేగంగా వస్తుంది. కొవ్వూరు ఏబీఎన్ కళాశాల సమీపానికి వచ్చేసరికి ఎడమ వైపు నుంచి అడుగున్నర ఎత్తు ఉన్న డివైడర్పై నుంచి కుడి వైపునకు దూసుకొచ్చింది.అటుగా ఏదైనా కారు లేదా ద్విచక్రవాహనం వెళ్లి ఉంటే పెనుప్ర మాదమే జరిగేది. ఆ సమయంలో రాజమహేంద్రవరం నుంచి 17 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు ఏలూరు వెళుతోంది. ఆ బస్ను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదమేమీ జరగకుండా ఆగింది.ఈ ఘటనతో బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు ముందు సీటులో కూర్చున యర్నగూడెంకు చెందిన సిహెచ్.శిరీష తల బస్సు అద్దానికి తగలడంతో తీవ్ర గాయమైంది. 108 ఆంబులెన్స్లో గాయపడిన శిరీషను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు ముందుభాగంతో పాటు, కారు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసునమోదు చేయవలసి ఉంది. ఆ కారులో యువకులు ఉన్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa