ఆంధ్రప్రదేశ్ మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ - 208లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. లోకేష్ ముందుగా మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసి, కేబినెట్కు పంపారు. మెగా డీఎస్సీ ద్వారా 16347 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన ఫైల్పైనే సంబంధిత శాఖ మంత్రిగా తొలిసంతకం చేశారు. విధివిధానాలు రూపొందించి కేబినెట్ ముందు పెడుతూ నారా లోకేష్ సంతకం చేశారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ను పలువురు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘ నాయకులు అభినందనలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఎస్.సవిత, టీజీ భరత్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, భాష్యం ప్రవీణ్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ వేమూరి రవికుమార్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa