మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఎటువంటి లైంగిక వేధింపులకు గురికాకుండా మహిళల రక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని Alluri Sitharama Raju district సబ్ కలెక్టర్ పి.దాత్రి రెడ్డి అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పది మంది మహిళా ఉద్యోగులు ఉన్న ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్గత కమిటీలను ఏర్పాటు చేసి నివేదికలు సమర్పించాలన్నారు. అన్ని మండల కార్యాలయాల్లోను కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 హెచ్ ప్రకారం గౌరవంగా జీవించే హక్కు, ఏదైనా వృత్తిని అభ్యసించే హక్కు, లైంగిక వేధింపులు గురికాకుండా సురక్షిత వాతావరణం కలిగి ఉండే హక్కులను మహిళలు పొంది ఉన్నారన్నారు. మహిళలు స్వేచ్ఛగా, భద్రత కలిగి ఏదైనా వృత్తి, వ్యాపారం నిర్వహించడానికి అవసరమైన వాతావరణ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa