జింబాబ్వే పర్యటనను ఓటమితో ఆరంభించిన యువ భారత్.. రెండో టీ20 మ్యాచ్లో అదరగొట్టింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో బ్యాటర్ల వైఫల్యంతో భారత్.. 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ మరుసటి రోజే జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తడబడిన అదే చోట సత్తా చాటారు. తొలిమ్యాచ్లో జట్టంతా కలిసి వంద పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డ చోటే.. ఓపెనర్ ఒక్కడే సెంచరీ కొట్టాడు. మిగతా బ్యాటర్లు కూడా తలా ఓ చేయి వేయడంతో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే రెండో ఓవర్లోనే గిల్ (2) ఔట్ అయ్యాడు. శనివారం తన డెబ్యూ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు. ఐపీఎల్ 2024 ఫామ్ను కొనసాగిస్తూ.. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలుత ఇన్నింగ్స్ను నిదానంగానే ప్రారంభించిన అతడు.. ఆ తర్వాత టాప్ గేర్ వేశాడు. తాను ఎదుర్కొన్న తొలి 30 బంతుల్లో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత 16 బంతుల్లోనే 59 రన్స్ స్కోరు చేశాడు.
కాగా అభిషేక్.. టీమిండియా తరఫున తన టీ20 కెరీర్లో తొలి పరుగును, తొలి హాఫ్ సెంచరీని, తొలి సెంచరీని సిక్స్తోనే నమోదు చేయడం గమనార్హం. 82 వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుటు వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ.. 46 బంతుల్లోనే సెంచరీని నమోదు చేశాడు. కానీ ఆ తర్వాత బంతికే ఔట్ అయ్యాడు. చివరకు 47 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో 7 ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ 8 సిక్సులు బాదడం గమనార్హం.
అభిషేక్ శర్మతో పాటు.. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77 రన్స్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 రన్స్) స్కోరు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు స్కోరు చేసింది. కాగా ఈ మ్యాచ్లో తొలి పది ఓవర్లలో 74/1 పరుగులు చేసిన టీమిండియా ఆ తర్వాత పది ఓవర్లలో 160/1 రన్స్ చేసింది. రింకూ సింగ్ ఆఖర్లో 5 సిక్సులు బాది మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa