ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ 25మంది విద్యార్థులు భవిష్యత్కు బాట వేసింది. ఏపీకి చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. వీరందరికి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీటు దక్కినా.. ఐఐటీ మద్రాస్ తెచ్చిన కొత్త నిబంధన కారణంగా సమస్య ఎదురైంది. మంత్రి లోకేష్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయగా.. వెంటనే సమస్యను పరిష్కరించారు. రాష్ట్రానికి చెందిన సుమారు 25 మంది విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం.. లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒక దానికి మినహాయింపు ఉంది. ఈ మేరకు ఆ సబ్జెక్టుకు సంబంధించి ‘E (ఎగ్జంప్షన్)’ అని పేర్కొంటూ మార్కుల జాబితా ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది జోసా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటీ మద్రాస్ నిబంధనలు మార్చడంతో సమస్య మొదలైంది. ఇంటర్లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని కొత్త నిబంధనను తీసుకొచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అలా మెమో ఇవ్వకపోవడంతో కొందరు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో సీటు కోల్పోయే పరిస్థితి వచ్చింది.
విజయవాడకు చెందిన విద్యార్థి మారుతీ పృథ్వీ సత్యదేవ్.. ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించారు. జోసా కౌన్సెలింగ్ సమయంలో సర్టిఫికేట్ల పరిశీలన చేసే సమయంలో మెమోను చూస్తే.. నాలుగు సబ్జెక్టులకే మార్కులు ఉండటంతో ఐఐటీ మద్రాస్ అధికారులు సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. వెంటనే సత్యదేవ్ ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. సత్యదేవ్ జూన్ 22న సమస్యను మంత్రి లోకేష్కు వాట్సప్ ద్వారా విషయాన్ని చెప్పారు. మంత్రి వెంటనే స్పందించి.. విద్యార్థి, ఆయన తండ్రి జయరామ్తో మాట్లాడారు. మెమోలో ‘ఇ’ స్థానంలో.. మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు ఐదో సబ్జెక్టును కలిపి కొత్త మెమోను ఇచ్చారు.
అయినా కూడా ఐఐటీ మద్రాస్ అధికారులు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ జీవో కావాలని చెప్పడంతో.. ఈ సమస్యను కూడా సత్యదేవ్ మరోసారి మంత్రి పేషీకి తెలియజేశారు. లోకేష్ అధికారులతో మాట్లాడడిజ. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని, వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఐఐటీ మద్రాస్ అధికారులతో మాట్లాడాలని సూచించడంతో.. ఆ వెంటనే జీవో జారీ చేశారు.. దీంతో సత్యదేవ్కు రౌండ్-1లోనే సీటు దక్కింది. ఈ జీవో కారణంగా రాష్ట్రంలో 25 మందికి జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు దక్కడంతో వారంతో ఆనందంగా ఉన్నారు.
మంత్రి నారా లోకేష్ సమస్యపై స్పందించి.. చొరవ తీసుకోవడంతో జీవో విడుదలైంది.రాష్ట్రంలోని మొత్తం 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థల్లో సీట్లు దక్కాయి. విజయవాడకు చెందిన పృథ్వీ సత్యదేవ్ ఐఐటీ మద్రాస్లో సీటు వచ్చింది. విజయవాడకు చెందిన సి.రఘునాథ్రెడ్డి ఐఐటీ కాలికట్ సీటు రాగా.. విజయవాడకు చెందిన జీ.కృష్ణసాయి సంతోష్ ఎన్ఐటీ సూరత్కల్లో సీటు సాధించారు. అలాగే నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 25మందికి సీట్లు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa