‘డ్రగ్స్పై విద్యార్థులను చైతన్య పరిచేందుకు స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. న్యాయపర చిక్కులను తొలగించి త్వరగా పోస్టుల భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రాజకీయ ప్రమేయం లేకుండా నియామకం జరగాలి. ప్రతిభ ఆధారంగా, పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలి. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్ ఇయర్, ఎగ్జామినేషన్ షెడ్యూల్, క్యాలండర్ రూపొందించాలి. నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలి అని’ అధికారులకు మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.